సందు దొరికితే చాలు మెగా ఫ్యామిలీపై విరుచుకుపడుతుంది శ్రీరెడ్డి. చాలా కాలంగా మెగా హీరోలైన చిరంజీవి,పవన్ కళ్యాణ్ శ్రీరెడ్డి టార్గెట్ గా ఉన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పై శ్రీరెడ్డి త్రీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు.
అప్పట్లో చిరంజీవి పార్టీ అమ్మి రీ ఎంట్రి అప్పుడు తమిళ్ సినిమా రీమేక్ తో వచ్చాడు,ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎన్నికలలో ఓడిపోయాక రీ ఎంట్రి కి హిందీ సినిమా రీమేక్ తో వస్తున్నాడు, కొత్త కథ తో వస్తే ఎక్కడ ఫ్లాప్ అవుతుందో అని భయం 😂#VakeelSaabTrailer https://t.co/CI0lj9I4SX
— Sri Reddy (@MsSriReddy) March 29, 2021
తాజాగా పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీని టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి. . చిరంజీవిని కూడా కలుపుతూ ఇద్దరిపై వ్యంగ్యాస్త్రాలు వదిలింది.చిరంజీవి పీఆర్పీ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తరువాత 2017లో సిల్వర్ స్క్రీన్ రీ ఎంట్రీ ఇచ్చారు.వివి వినాయక్ దర్శకత్వంలో ఖైదీ 150మూవీ చేయడం జరిగింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. ఖైదీ 150 తమిళ చిత్రం కత్తికి తెలుగు రీమేక్. మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కిన ఆ చిత్రాన్ని తెలుగులో ఖైదీ 150గా చిరంజీవి రీమేక్ చేశారు….
ఇక పవన్ కళ్యాణ్ విషయాన్ని కొస్తే 2019సార్వత్రిక ఎన్నికలలో జనసేన పార్టీ ప్రభావం చూపలేకపోయింది. పవన్ పోటీ చేసిన భీమవరం, గాజువాక నియోజకవర్గాలలో ఓడిపోగా.కేవలం జనసేన తరపున ఒక అభ్యర్థి గెలుపొందారు….కాగా ప్రత్యక్ష రాజకీయాలలో ఉంటూనే పవన్ సినిమాలు చేస్తున్నట్లు ప్రకటించారు.2019 చివర్లో ఆయన కమ్ బ్యాక్ ప్రకటించడంతో పాటు.. పింక్ రీమేక్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు.
ఈ రెండు విషయాలను ప్రస్తావిస్తూ శ్రీరెడ్డి చిరు, పవన్ ని ఎద్దేవా చేశారు.అప్పట్లో చిరంజీవి పార్టీ అమ్మి రీ ఎంట్రి అప్పుడు తమిళ్ సినిమా రీమేక్ తో వచ్చాడు, ,ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎన్నికలలో ఓడిపోయాక రీ ఎంట్రి కి హిందీ సినిమా రీమేక్ తో వస్తున్నాడు, కొత్త కథ తో వస్తే ఎక్కడ ఫ్లాప్ అవుతుందో అని భయం.. అంటూ ట్విట్టర్ పోస్ట్ పెట్టారు….
చిరు, పవన్ తమ కమ్ బ్యాక్ చిత్రాలు ప్లాప్ అవుతాయనే భయంతో స్ట్రైట్ చిత్రాలు కాకుండా, రీమేక్స్ ఎంచుకున్నారని ఆమె విమర్శించడం జరిగింది.శ్రీరెడ్డి పోస్ట్ ఎప్పటిలాగే పవన్, చిరు అభిమానులకు కోపానికి కారణం అయ్యింది.దీనితో కామెంట్స్ రూపంలో వారు తమ ఆగ్రహాన్ని తెలియజేస్తున్నారు….