ఇలాంటి సమయంలో కొందరు విహారయాత్రలకు వెళ్లడం సరికాదని అభిప్రాయపడింది. సెలెబ్రిటీలను అభిమానించే ఫ్యాన్స్ కష్టాలో ఉన్నప్పుడు పార్టీలు చేసుకోవడం, టూర్కు వెళ్లి ఎంజాయ్ చేయడం మంచి పద్ధతి కాదని చెప్పింది. తన వంతుగా ప్రజలకు ఉపయోగపడే ఎటువంటి సమాచారాన్నయినా షేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపింది. కాగా, ఇటీవల సినీనటులు రణ్బీర్, అలియా, జాన్వి, సారా, దిశా పటానీతో పాటు పలువురు టూర్లకు వెళ్లి ఎంజాయ్ చేసి ఫొటోలను పోస్ట్ చేశారు. వారిపై విమర్శల జల్లు కురుస్తోంది.