లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ పాళ్లను సమానంగా కలుపుకుని ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో కిషోర్ తిరుమల సిద్ధస్తుడు. ‘నేను శైలజ’ .. ‘చిత్రలహరి’ సినిమాలు అందుకు నిదర్శనంగా కనిపిస్తాయి. ఇటీవల రామ్ హీరోగా ఆయన చేసిన ‘రెడ్’ ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేదు. ఆ తరువాత ప్రాజెక్టుగా కిషోర్ తిరుమల ఈ సినిమా చేస్తున్నాడు. శర్వానంద్ జోడీగా రష్మిక తొలిసారిగా స్క్రీన్ షేర్ చేసుకోనుంది. ప్రస్తుతం శర్వానంద్ చేస్తున్న ‘మహాసముద్రం’ .. ‘ఒకే ఒక జీవితం’ తరువాత ఈ సినిమా థియేటర్లకు రానుంది.