బాలీవుడ్ నటి విద్యా బాలన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘షేర్నీ’. అమిత్ మసుర్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. జూన్ 18 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ విడుదలైంది. ఇందులో అటవీ శాఖ అధికారిగా కనిపించింది విద్యా బాలన్. మనిషి-జంతు సంఘర్షణా ప్రపంచంలో సమతౌల్యం తెచ్చేందుకు పోరాడుతూ ఉంటుంది. అడవి నేపథ్యంలో సాగిన సన్నివేశాలు, నేపథ్య సంగీతం ఆకట్టుకుంటున్నాయి. మరి షేర్నీ అనుకున్నది సాధించిందా, లేదా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ సినిమాలో శరద్ సక్సేనా, ముకుల్ చద్ధా, విజయ్ రాజ్, అరుణ్, బ్రిజేంద్ర కాలా, నీరజ్ కబి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని టీ-సిరీస్, అబుందాంటియా ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు నిర్మించాయి.