బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మరియు కోలీవుడ్ యంగ్ అండ్ స్టార్ దర్శకుడు అట్లీ కాంబినేషన్లో ఓ భారీ చిత్రం తెరకెక్కనున్నట్టు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. కాని దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే రావడం లేదు. తాజాగా ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్కి సంబంధించిన క్రేజీ వార్త ఒకటికి బయటకు వచ్చింది.
శుక్రవారం ఈ మూవీ సెట్స్పై వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా పూణేలో జరిగే షూటింగ్ కోసం శుక్రవారం నయతార, ప్రియమణిలు పమయనమైనట్లు సమాచారం. పుణే ఎయిర్పోర్ట్ నుంచి వారిద్దరూ బయటకు వస్తున్న ఫొటోలు నెట్టింట దర్శనమించాయి. దీంతో ఈ ఫొటోలు వైరల్గా మారాయి.
ఈ చిత్రం ఒక సాలిడ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లా ఉంటుందని టాక్. వీటితో పాటుగా ఈ సినిమాకి ఆల్రెడీ అదిరే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్ కూడా కంప్లీట్ అయ్యిపోయినట్టుగా సమాచారం. జవాన్ అనే టైటిల్ని ఈ ప్రాజెక్ట్కి పరిశీలిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇందులో షారూఖ్ డ్యూయల్ పాత్ర పోషించనున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ నయనతార తో పాటుగా సన్యా మల్హోత్రా కూడా ఫిక్స్ అయ్యిందట. ఈ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ని షేక్ చేస్తుందనే కాన్ఫిడెంట్లో అందరు ఉన్నారు.
. @iamsrk – #Nayanthara – @Atlee_dir 's new #Bollywood project shoot started in #Pune
Best wishes to @Atlee_dir and Nayan for their 1st Hindi project..
Best wishes to @iamsrk and rest of the team for Blockbuster Success..
— Ramesh Bala (@rameshlaus) September 4, 2021