శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘లవ్ స్టోరీ’, నాని ‘టక్ జగదీష్’ కంగనా ‘తలైవి’ చిత్రాలు ఇప్పటికే వాయిదా పడ్డాయి. ఇక రానా నటించిన ‘అరణ్య’ హిందీ వెర్షన్ పోస్ట్ పోన్ అయ్యింది.
ఈ పోస్ట్పోన్ల పర్వం.. విరాటపర్వం వరకూ వచ్చింది. రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన విరాటపర్వం ఏప్రిల్ 30న విడుదల కావాల్సి ఉండగా.. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమాని వాయిదా వేస్తున్నట్టు అధికారిక ప్రకటన విడుదల చేసింది చిత్రయూనిట్. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ని ప్రకటిస్తామని చెప్పింది చిత్ర యూనిట్.
వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్ర ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్లు అద్భుతమైన రెస్పాన్స్ రాబట్టడటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ చిత్రంలో రానా నక్సలైట్గా కనిపించబోతున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ డి.సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి.సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.
శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘లవ్ స్టోరీ’, నాని టక్ జగదీష్ సినిమాలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అటు బాలీవుడ్ క్వీన్ కంగన నటించిన ‘తలైవి’ చిత్రం కూడా వాయిదా పడింది. ఇక రానా నటించిన అరణ్య హిందీ వెర్షన్ పోస్ట్ పోన్ అయ్యింది. అయితే అరణ్య సినిమా ఫ్లాప్ కావడంతో పాటు ఇప్పుడు ‘విరాట పర్వం’ రిలీజ్ వాయిదా పడటంతో రానాకి దెబ్బ మీద దెబ్బ అనే చెప్పాలి. అయితే విరాట పర్వం సినిమా టీజర్, ట్రైలర్ చూసిన తరువాత ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అనే బజ్ ఇండస్ట్రీలో ఉండటంతో ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్.
#VirataParvam Release Postponed!
New Release Date will be announced soon.Please Mask Up & Stay Safe.@RanaDaggubati @Sai_Pallavi92 @venuudugulafilm @dancinemaniac @sreekar_prasad #DivakarMani #SureshBobbili @laharimusic @SureshProdns pic.twitter.com/LX808U5tcV
— SLV Cinemas (@SLVCinemasOffl) April 14, 2021