యావత్ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న తెలుగు చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఇప్పటికే రెండు పాటల మినహా చిత్రీకరణ పూర్తయింది. మిగిలిన భాగాన్ని చిత్రీకరించేందుకు ఆఖరి షెడ్యూల్ని ఉక్రెయిన్లో ప్లాన్ చేసింది చిత్రబృందం. ఈ మేరకు మంగళవారం ఉక్రెయిన్ పయనమైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘ఆర్ఆర్ఆర్’ టీం విమాన ప్రయాణ వీడియోను షేర్ చేసింది. ‘‘ఆఖరి షెడ్యూల్ కోసం ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర బృందం ఉక్రెయిన్లో ల్యాండ్ అయింది’’ అని పేర్కొంది. పీరియాడికల్ డ్రామాగా భారీ బడ్జెట్తో రూపొందుతోన్న ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీంగా ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఆలియా భట్, ఒలివియా మోరిస్ నాయికలు. అజయ్ దేవ్గణ్, శ్రియ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబరు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.
#RRRMoive Landed in #Ukraine
Jai ntr@tarak9999 #KomaramBheemNTR pic.twitter.com/nPoh2Ish1V— Saisreekanth75 (@saisreekanth75) August 3, 2021