జపాన్ రాజధాని టోక్యోలో అతిపెద్ద క్రీడా సంబురం ఒలింపిక్స్ మరి కొద్ది గంటలలో ప్రారంభం కానుంది. పలు దేశాలకు చెందిన క్రీడాకారులు ఈ మెగా ఈవెంట్లో పాల్గొని పతకాలు గెలవాలనే కసితో ఉన్నారు. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్లో కేవలం రెండే మెడల్స్ గెలిచి తీవ్రంగా నిరాశ పరిచిన ఇండియా ఈ సారి మాత్రం ఎక్కువ మొత్తంలో పతకాలు గెలవాలనే కసితో ఉంది. సానియా మీర్జా, సింధు, సాక్షి మాలిక్ వంటి క్రీడాకారులపై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. వారికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువ కురిపిస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం కూడా టీమిండియా క్రీడాకారులకు ప్రత్యేక పోస్టర్ ద్వారా విషెస్ తెలియజేసింది. గన్ చేత పట్టిన రామ్ చరణ్ ఫోటో, బళ్లెం పట్టిన ఎన్టీఆర్ పొటోని జత చేసి శుభాకాంక్షలు అందించింది. టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొనే ఇండియన్ క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్ అంటూ ఆర్ఆర్ఆర్ టీం విషెస్ తెలిపింది. ప్రత్యేక పోస్టర్ సినీ , క్రీడా ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. అక్టోబర్ 13న ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదల కానున్న విషయం తెలిసిందే.
We are joining the nation in cheering for the Indian contingent for Tokyo Olympics 🙌🏻
Let's root for the talented athletes representing our country 🇮🇳
We are with you, @IndianOlympians ! ✊🏻 #Tokyo2020 #Cheer4India @afiindia @WeAreTeamIndia #RRRMovie pic.twitter.com/I0AQSEdZD6
— RRR Movie (@RRRMovie) July 22, 2021