‘జబర్దస్త్’ ప్రోగ్రాం నుంచి నందమూరి బాలకృష్ణకు సినీనటి రోజా ఫోన్ చేసి మాట్లాడారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను ఆ కార్యక్రమ నిర్వాహకులు విడుదల చేశారు. ‘జబర్దస్త్’ వేదిక నుంచి బాలకృష్ణకు రోజా ఫోన్ చేయడంతో ఆ ప్రోగ్రాంలోని వారంతా సంబరపడిపోయారు
తమ అందరి సమక్షంలో బాలకృష్ణకు కాల్ చేయండని రోజాను అనసూయ కోరింది. అయితే, బాలకృష్ణ ఈ సమయంలో మంచి మూడ్లో ఉంటే ఓకే. లేకపోతే ఎలా? అని రోజా ప్రశ్నిస్తూనే ఫోన్ చేసింది. బాలయ్య ఫోన్ ఎత్తాడు. దీంతో హలో సర్.. బాగున్నారా? అని రోజా ప్రశ్నించారు.
రోజాగారు నమస్కారం అని అన్నారు. తాను బాగున్నానని, మన అఖండ షూట్లో ఉన్నానని చెప్పారు. మళ్లీ మనిద్దరం కలిసి ఎప్పుడు సినిమా చేద్దామని బాలయ్యను రోజా ప్రశ్నించారు. భైరవద్వీపం పార్ట్ 2 చేద్దామా? లేక బొబ్బిలిసింహం పార్ట్ 2 చేద్దామా? అని అడిగారు. తమ కాంబినేషన్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారని బాలకృష్ణ చెప్పారు. ‘జబర్దస్త్’ ప్రోగ్రాంకు జడ్జీగా తాను వస్తానని బాలకృష్ణ అనడంతో అందరూ ఖుషీ అయ్యారు.