పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ .. పవన్ తో విడిపోయాకా మరాఠి లో సినిమాలు నిర్మించారు. ముక్యంగా ఆమెకు దర్శకత్వం, ఎడిటింగ్ పై మంచి అవగాహన ఉంది. దర్శక నిర్మాతగా ఆమె మరాఠీ సినిమాలతో బిజీగా ఉన్నారు. త్వరలో తెలుగులోను ఒక సినిమాకి దర్శకత్వం వహించాలనే ఉద్దేశంతో ఒక కథను సిద్ధం చేసుకుంటున్నట్టుగా ఆ మధ్య చెప్పారు. ఎప్పటికప్పుడు అభిమానులతో సోషల్ మీడియా ద్వారా యాక్టీవ్ గా ఉంటున్న రేణు దేశాయ్ .. తాజాగా ఆమె అభిమానులతో లైవ్ లో మాట్లాడారు. అకీరా ఎంట్రీ కోసం పవన్ అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. జూనియర్ పవర్ స్టార్ ఎంట్రీ ఎప్పుడనే విషయాన్ని అడిగారు. “ఒక వైపున కరోనా విజృంభిస్తోంది .. దాని బారినపడి ఎంతోమంది ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఎవరి ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నంలో వాళ్లు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హీరోగా అకీరా ఎంట్రీ గురించి మాట్లాడుకోవడానికి ఇది సరైన సమయం కాదు” అని ఆమె సమాధానం ఇచ్చారు. మొత్తానికి అఖీరా ఎంట్రీ విషయాన్ని సైడ్ చేసారు రేణు !!