టాలీవుడ్, బాలీవుడ్ నుంచి వరుస ఆఫర్స్ చేజిక్కించుకుంటున్న రష్మిక మందన తాజాగా తన రెమ్మ్యూనరేషన్ విషయమై క్రేజీ రియాక్షన్ ఇచ్చింది. నా కల అదేనంటూ మనసులో మాట చెప్పేసింది.
కిరిక్ పార్టీ అనే కన్నడ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన కన్నడ భామ రష్మిక మందన.. ‘ఛలో’ అంటూ టాలీవుడ్ గడపతొక్కి అనతికాలంలోనే బిజీ హీరోయిన్గా మారింది. విజయ్ దేవరకొండ సరసన నటించిన ‘గీత గోవిందం’ సినిమా ఆమె కెరీర్ని టర్న్ చేసింది. దీంతో తెలుగు సినిమా దర్శకనిర్మాతలు రష్మిక డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. మరోవైపు బాలీవుడ్ నుంచి కూడా ఆమెకు ఆఫర్స్ వస్తున్నాయి. దీంతో రష్మిక రేటు పెంచేసిందని, అమ్మడికి అప్పుడే అంత డిమాండా? అనే వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం లోకి వచ్చాయి. తాజాగా ఈ విషయమై రియాక్ట్ అయింది రష్మిక.
ఓ బాలీవుడ్ మూవీ కోసం రష్మిక మందన ఏకంగా రెండు కోట్ల రూపాయల రెమ్మ్యూనరేషన్ తీసుకుందని వార్తలు షికారు చేస్తుండటంతో దీనిపై క్రేజీగా స్పందించింది ఈ ముద్దుగుమ్మ. ”నేను భారీ రెమ్మ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. అవే నిజమైతే ఎంత బాగుండో! అయినా వాళ్ళిస్తే నేనెందుకు వద్దంటా?” అనేసింది రష్మిక. అంతటితో ఆగక తన మనసులోని మాట కూడా బయటపెట్టేసింది. మీరంతా అనుకున్నంత ఆ రెమ్యూనరేషన్ తీసుకోవాలనేదే నా కల అని ఆమె పేర్కొంది. దీంతో రష్మిక వెండితెరపైనే కాదు, మాటల్లోనూ క్రేజీనే అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన ‘పుష్ప’ సినిమాలో నటిస్తోంది రష్మిక. సుకుమార్ రూపొందిస్తున్న ఈ సినిమాలో ఆమె రోల్ మునుపెన్నడూ చుడనివిధంగా, మరింత క్రేజీగా ఉంటుందట. దీంతోపాటు శర్వానంద్ హీరోగా రాబోతున్న ‘ఆడాళ్లు మీకు జోహార్లు ’ అనే సినిమాలో ఆమె భాగమవుతోంది. వీటితో పాటు మరో రెండు బాలీవుడ్ సినిమాల్లో కూడా ఆమె నటిస్తోంది.