రష్మిక మందన్నా ఇటీవల తన బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంది. ఏకంగా బిగ్బీ అమితాబ్ బచ్చన్ సమక్షంలోనే తన పుట్టిన రోజుని సెలబ్రేట్ చేసుకోవడం విశేషం.ఈ రోజుని, ఈ ఏడాదిని తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని అంటోంది రష్మిక. పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన రష్మిక మందన్నా పుట్టిన రోజు ముంబయిలో ఘనంగా జరిగింది.బిగ్బీ అమితాబ్ బచ్చన్ సైతం ఈ అమ్మడి బర్త్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొనడం విశేషం.
ఆయనతోపాటు `గుడ్బై` చిత్ర దర్శకుడు వికాస్భల్ కూడా పాల్గొన్నారు. `గుడ్బై` టీమ్ స్పెషల్గా రష్మిక బర్త్ డేని సెలబ్రేట్ చేయించారు.ఈసందర్భంగా రష్మిక ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు.ఈ బర్త్ డే ఫోటోలను పంచుకుంటూ `ఇది జీవితంలో ఎంతో సంతృప్తినిచ్చిన రోజు` అని పేర్కొంది. తాను మాస్క్ ధరించానని, ఫోటో కోసం తీసేశానని కూడా పేర్కొంది..
ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఇక ఈ బర్త్ డే సందర్భంగా రష్మిక చెబుతూ, ఈ ఏడాది తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొంది….
ప్రస్తుతం హిందీలో అమితాబ్తో `గుడ్బై` చిత్రంలో నటిస్తుంది. వికాస్భల్ దర్శకత్వం వహిస్తున్నారు. తండ్రీకూతుళ్ల మధ్య అనుబంధం.ప్రధానంగా సాగే చిత్రమిది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది.దీంతోపాటు సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి `మిషన్ మజ్ను` చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్ర షూటింగ్లో ఇటీవల సిద్ధార్థ్ కాలుకి గాయమైందట.ప్రస్తుతం బాగానే ఉందని టాక్. అన్నట్టు రష్మిక ఈ నెల 5న తన 25వ పుట్టిన రోజుని జరుపుకుంది.