రానా దగ్గుపాటి ఈ పేరు తెలియని సినీ ప్రేమికులు ఉండరు. బాహుబలి సినిమాతో జాతియ స్థాయి గుర్తింపు పొందిన రానా ఎప్పుడూ కూడా ప్రయోగం చేయడానికి ముందుంటారు. అలా రానా చేసిన తాజా ప్రయోగం అరణ్య. బాహుబలి తరువాత రానా చేసిన సినిమా ఇది. ఈ సినిమా కోసం రానా భారీగా బరువు తగ్గారు. అరణ్య సినిమా కోసం రానా ఇంత కష్టపడినా సినిమా అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు రాలేక పోయింది. ఈ సినిమా ఎన్నో వాయిదాల తరువాత ఇటీవల రిలీజ్ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాను మార్చి26న విడుదల చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతం అభిమానులంతా ఈ సినిమా ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా మూడు భాషల్లో తెరకెక్కతుంది. ఇక ట్రైలర్ విషయానికొస్తే ఈ సినిమా ట్రైలర్ అన్ని భాషల్లో ఒకేసారి విడుదల కావడం లేదు. తెలుగు, తమిళ భాషల్లో మార్చి3న, హిందీలో మార్చి4న రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఏనుగుల సంరక్షణ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో జోయా హుస్సేస్, విష్ణు విశాల్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను ప్రభు దర్శకత్వంలో ఈరోస్ ఇంటర్నేషనల్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Are you ready for 2021's first trilingual film? The thrilling fight between Man VS Nature to #SaveTheElephants is back
Stay tuned on @ErosNow for the trailer of Aranya and Kaadan releasing on 3rd March and Haathi Mere Saathi on the 4th of March!
IN THEATRES on 26th March! pic.twitter.com/nMqu62REDT
— Rana Daggubati (@RanaDaggubati) February 28, 2021