ప్రస్తుతం దేశంలో ఎక్కడికెళ్లినా ప్రతి ఒక్కరి నోట నుండి కరోనా వైరస్ పేరు వినిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తీవ్రత దారుణంగా మారింది. అంతేకాకుండా రోజురోజుకు లక్షల సంఖ్యలో కేసులు పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా హాస్పిటల్లో రోగులకు బెడ్ లు దొరకడం కష్టమవుతుంది. సరైన ఆక్సిజన్ అందక ఎంతో మంది ప్రాణాలు అక్కడే వదిలేస్తున్నారు.
ఇంత తీవ్రంగా ఉన్నా మన దేశ పరిస్థితి చాలా ఘోరంగా మారింది. ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక అన్ని రంగాలు మూతబడ్డాయి. ఇక సిని ఇండస్ట్రీలో కూడా ఎంతోమంది నటీనటులు, సినీ బృందాలు వైరస్ బారిన పడ్డారు. ఇక ఈ నేపథ్యంలో సెలబ్రిటీలు అంతా సోషల్ మీడియా వేదికగా ప్రజలకు జాగ్రత్తలు తెలుపుతున్నారు. అంతేకాకుండా ప్రజలకు సహాయం చేయడానికి సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా.. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పై.. రాఖీ సావంత్ విమర్శలు చేసింది.
దేశంలో పరిస్థితులు ఇంత తీవ్రంగా ఉన్న సమయంలో బాలీవుడ్ నటులంతా సేవ లో ఉంటే.. నీవు ఎందుకు సహాయం చేస్త లేవని ప్రశ్నించింది. ఈ విధంగా ముంబైలో మీడియాతో మాట్లాడిన రాఖీ సావంత్ రోడ్డుపై శానిటైజర్ చల్లుతూ మీడియాను దగ్గరికి రావద్దని తరుముతుంది. కరోనా ను పెంచి పోషించద్దంటూ.. కరోనాకు యవ్వనం కలిగించవద్దని తెగ హల్ చల్ చేసింది. ఇక ఈ నేపథ్యంలో దేశ పరిస్థితి బాగోలేదని కంగనా రనౌత్ అంటున్నారని అంతేకాకుండా దేశంలో చాలా కోట్ల ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఉందని అంటున్నారని దీని గురించి మీ అభిప్రాయం ఏమిటని రాఖీ సావంత్ ని ప్రశ్నించారు. దీంతో వెంటనే రాఖీ సావంత్.. దేశంలో ఆక్సిజన్ సిలిండర్లు కొరత ఉందా? అయితే కంగనా నీవు దేశానికి సేవ చేయి. నీ వద్ద కోట్ల రూపాయల ఆస్తి ఉందిగా.. ఆక్సిజన్ కొనుగోలు చేసి ప్రజలకు పంపిణీ చేయి అంటూ ఘాటుగా స్పందించింది.