ఈ సినిమా పట్టాలెక్కిన దగ్గర నుంచి అప్ డేట్స్ పెద్దగా వదల్లేదు. చాలా సమయం తరువాత ఒకటి రెండు పోస్టర్లు వదిలారు. ఆ తరువాత కూడా అప్ డేట్స్ పరంగా మరింత గ్యాప్ తీసుకున్నారు. షూటింగు ఆలస్యం కావడం .. రీ షూట్లు జరుగుతున్నాయనే టాక్ రావడం కొంత అసహనానికి గురిచేశాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా షూటింగు పార్టును పూర్తిచేసుకుంది.
ఇక ఈ సినిమా నుంచి మూడు రోజుల్లో అప్ డేట్ ను వదలనున్నట్టు దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ట్వీట్ చేశాడు. మరి ఆ అప్డేట్ ఏ రూపంలో ఉండనుందనేది చూడాలి. ‘సాహో’ తరువాత ప్రభాస్ నుంచి రానున్న సినిమా ఇదే. ఇక్కడి నుంచే ప్రభాస్ పాన్ ఇండియా సినిమాల వరుస మొదలుకానుంది. దాంతో సహజంగానే అందరిలో ఆసక్తి మొదలవుతోంది.