ఈ పాటను చంద్రబోస్ రాశారు. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో ఈ సినిమా రూపుదిద్దుకుంటోన్న విషయం తెలిసిందే. ‘అల.. వైకుంఠపురములో’ వంటి భారీ హిట్ తర్వాత అల్లు అర్జున్ నటిస్తోన్న సినిమా ‘పుష్ప’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ లో అల్లు అర్జున్ కనపడిన తీరు అలరించింది. ఈ సినిమాను మైత్రీ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తొలి పార్టును క్రిస్మస్ కు విడుదల కానుందని ఈ సినిమా యూనిట్ ఇప్పటికే స్పష్టం చేసింది. పాన్ ఇండియా మూవీగా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్ కథాంశంతో వస్తోంది