రెబెల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’ షూటింగ్ ఫైనల్ స్టేజ్కు వచ్చింది. దాదాపు వారం రోజుల షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉంది. ఇప్పుడు పెండింగ్ పార్ట్కు సంబంధించిన చిత్రీకరణ జరుగుతోంది. కృష్ణంరాజు, ప్రభాస్ కలిసి ఉండే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కృష్ణంరాజు రాధేశ్యామ్ సెట్స్ నుంచి కిర్రాక్ ఫొటోను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. ఈ ఫొటోలో కృష్ణంరాజు, ప్రభాస్ స్టైల్గా నిలబడి ఉన్నారు. కృష్ణంరాజు, ప్రభాస్ ..1970 బ్యాక్డ్రాప్లో జరిగే కథలో కనిపిస్తారట. ఈ విషయాన్ని కృష్ణంరాజు తెలియజేశారు. ఈ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.
పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోన్న ఈ పీరియాడికల్ లవ్స్టోరికి సంబంధించి రీసెంట్గా గ్లింప్స్ విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలాగే ఈ ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి హిందీ వెర్షన్కు ఇద్దరు సంగీత దర్శకులు పనిచేస్తున్నారు. మిథున్ సంగీత దర్శకత్వంలో రెండు సినిమాలు, మనన్ భరద్వాజ్ ఒక పాటకు సంగీతాన్ని అందించారు. ఇక తెలుగు,తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ పాటలకు జస్టిన్ ప్రభాకర్ సంగీతాన్ని అందిస్తాడట.
Reminiscing the 70s with #Prabhas 🤩
Let’s go back in time with #RadheShyam on 30th July! pic.twitter.com/xhJD96U36i— U.V.Krishnam Raju (@UVKrishnamRaju) February 16, 2021