పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కనున్న ఓ ప్రతిష్ఠాత్మక చిత్రం ప్రారంభమైంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ‘ప్రాజెక్ట్ కే’ అనే వర్కింగ్ టైటిల్ ఫిక్స్ చేశారు. గురు పూర్ణిమ సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమం శనివారం ఉదయం హైదరాబాద్లో వేడుకగా జరిగింది. ఈ వేడుకలో ప్రభాస్తోపాటు బీటౌన్ అగ్రకథానాయకుడు అమితాబ్ బచ్చన్ కూడా పాల్గొన్నారు. ముహూర్తపు షాట్కి ప్రభాస్ క్లాప్ కొట్టారు. ఇందులో భాగంగా బిగ్బీపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఓ ఫొటో షేర్ చేసింది.
పాన్ ఇండియా మూవీగా విడుదల కానున్న ఈ సినిమాలో ప్రభాస్ విభిన్నమైన లుక్లో కనిపించనున్నారు. ఇందులో అమితాబ్ ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. దీపికా పదుకొణె కథానాయిక. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్తో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ నిర్మిస్తోంది. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు స్క్రీన్ప్లే పర్యవేక్షణ చేస్తున్నారు.