సినిమాల విషయంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దూకుడు పెంచారు. రెండు సినిమాలు చిత్రీకరణ దశలో ఉండగానే ఆయన కొత్త ప్రాజెక్టులను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే నాగ్అశ్విన్తో సినిమాను ఖరారుచేసిన ఆయన.. తాజాగా మరో చిత్రానికి ఓకే చెప్పారు. ఈ మేరకు ఆయన 25వ చిత్రానికి సందీప్రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నట్లు గురువారం ఉదయం తెలిపారు. ఈ చిత్రానికి ‘స్పిరిట్’ అనే పేరు ఖరారు చేశారు. టీ సిరీస్, వంగా పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాయి. యాక్షన్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా తెరకెక్కే అవకాశాలున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రభాస్ ప్రస్తుతం ‘సలార్’, ‘ఆదిపురుష్’ సినిమాల్లో నటిస్తున్నారు. ప్రశాంత్నీల్ తెరకెక్కిస్తున్న ‘సలార్’ ఫుల్ యాక్షన్ డ్రామాగా సిద్ధం కానుంది. ఇందులో ప్రభాస్ యాంగ్రీ లుక్లో కనిపించనున్నారు. అలాగే బాలీవుడ్ దర్శకడు ఓంరౌత్ సిద్ధం చేస్తున్న ‘ఆదిపురుష్’లో ఆయన రాముడిగా కనిపించనున్నారు. ఈ రెండు ప్రాజెక్ట్లు పూర్తైన తర్వాత నాగ్ అశ్విన్ తెరకెక్కించనున్న ‘ప్రాజెక్ట్ కే’లో ఆయన భాగం కానున్నారు. ఇక ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ సినిమా త్వరలో విడుదల కానుంది. మరోవైపు ‘అర్జున్రెడ్డి’తో తెలుగులో సూపర్హిట్ అందుకున్న సందీప్రెడ్డి వంగా అదే చిత్రాన్ని హిందీలో ‘కబీర్సింగ్’ పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా పాపులర్ అయ్యారు.
The Mighty man marching On…..🙂#Prabhas25SandeepReddyVanga#BhushanKumar#Prabhas @VangaPranay #KrishanKumar @TSeries @VangaPictures pic.twitter.com/gbkfh6suLn
— Sandeep Reddy Vanga (@imvangasandeep) October 7, 2021