కేవలం ఫస్ట్లుక్తోనే దేశ వ్యాప్తంగా అన్ని చిత్ర పరిశ్రమల్లోని సినీ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించిన చిత్రం ‘సలార్’. యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ హీరోగా ‘కేజీయఫ్’ దర్శకుడు ప్రశాంత్నీల్ ‘సలార్’ను పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి తర్వాతి ప్రకటన ఎప్పుడొస్తుందా? అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కాగా.. అందరి ఎదురుచూపులకు తెరదించింది చిత్రబృందం. ఎట్టకేలకు విడుదల తేదీని ప్రకటించింది. ఏప్రిల్ 14, 2022న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించింది.
‘సలార్’లో ప్రభాస్ సరసన శ్రుతిహాసన్ సందడి చేయనుంది. క్రేజీ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రాన్ని రూ.150కోట్ల భారీ బడ్జెట్తో హోంబలే ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తోంది. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ‘కేజీయఫ్’తో డైరెక్టర్గా సత్తా నిరూపించుకున్న ప్రశాంత్నీల్ సారథ్యంలో ‘బాహుబలి’తో ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ హీరోగా వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఇటీవల గోదావరిఖనిలోని బొగ్గుగనుల్లో చిత్రీకరించారు.
𝐑𝐞𝐛𝐞𝐥𝐥𝐢𝐧𝐠 Worldwide #Salaar On 𝐀𝐩𝐫𝐢𝐥 𝟏𝟒, 𝟐𝟎𝟐𝟐 💥
We can't wait to celebrate with you all 🔥#Salaar14Apr22#Prabhas @prashanth_neel @VKiragandur @hombalefilms @shrutihaasan @BasrurRavi @bhuvangowda84 pic.twitter.com/tQ3B1jbdt1
— Hombale Films (@hombalefilms) February 28, 2021