తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తమ్ముడు బాల మురుగన్ కరోనా తో కన్ను మూసారు. శుక్రవారం ఉదయం తన స్వస్థలం పెరియాకుళంలోనే బాలమురుగన్ తుది శ్వస విడవగా, గత కొంత కాలంగా కాన్సర్ తో సైతం బాధ పడుతున్నాడు. తిరువనంతపురం లో కాన్సర్ కోసం ట్రీట్మెంట్ తీసుకున్న బలమురుగన్ ఆ క్రమం లో కరోనా బారిన పడ్డారు. ఇంట్లో ఉండి కరోనా కోసం చికిత్స తీసుకుని కోలుకున్న సమయంలోనే కన్ను మూసారు. అయన మృతి పట్ల ముఖ్యమంత్రి స్టాలిన్ సైతం సంతాపం తెలిపారు. అన్న పన్నీర్ సెల్వం రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న బాల మురుగన్ మాత్రం వ్యవసాయం చేస్తూ కాలం గడిపేవారు.