విష్వక్సేన్, నివేదా పేతురాజు జంటగా నరేష్ కుప్పిలి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పాగల్’. ఇటీవల విడుదలైన ఈ సినిమా యూత్ను ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. సెప్టెంబరు 3న ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో విడుదలైన నెల రోజులోపే నెటిజన్లను అలరించేందుకు వస్తుండటం విశేషం. ఈ సందర్భంగా నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడారు.
* ‘‘మునుపటితో పోల్చితే ఇప్పుడు సినిమాలు చూసే వాళ్ల సంఖ్య బాగా తగ్గిపోయింది. వందలో అరవై మందే థియేటర్లకు వస్తున్నారు. కరోనా భయాలే దానికి కారణం. వందల కోట్ల వసూళ్లన్నవి ఇప్పుడు కష్టమే. మునపటిలా కుటుంబ ప్రేక్షకులు ధైర్యంగా థియేటర్లకు వచ్చినప్పుడే అంతటి వసూళ్లు చూడగలుగుతాం’’
* ‘‘పాగల్’ని ఏప్రిల్ నెలాఖరులో విడుదల చేద్దామనుకున్నాం. కరోనా ఉద్ధృతి వల్ల ఆలస్యమైంది. ఆగస్టు తొలి వారం వరకు చిత్ర విడుదల తేదీపై మాకు ఏ స్పష్టతా లేదు. ‘తిమ్మరుసు’, ‘ఎస్.ఆర్.కల్యాణమండపం’ చిత్రాల ఓపెనింగ్స్ చూశాక రాత్రికి రాత్రే ఓ నిర్ణయానికి వచ్చాం. అలా సినిమాని ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాం’’
* ‘‘ఎగ్జిబ్యూటర్, డిస్టిబ్యూటర్, ప్రొడ్యూసర్.. ఈ ముగ్గురిని ఆనందంగా ఉంచే చిత్రమే నా దృష్టిలో సూపర్ హిట్ సినిమా. మా ‘పాగల్’ అలాంటి చిత్రమే. విడుదలకు ముందే శాటిలైట్, డిజిటల్ రైట్స్ క్లోజ్ అవడంతో.. తొలి రెండు రోజుల ఓపెనింగ్స్తోనే బ్రేక్ ఈవెన్కు చేరుకున్నాం. ఇప్పటికే రూ.12కోట్ల పైన గ్రాస్ సాధించాం. ఈ చిత్రం సెప్టెంబరు 3న అమెజాన్ ప్రైమ్లో విడుదల కానుంది’’