భీష్మ ఏకాదశి సందర్భంగా కథానాయకుడు బాలకృష్ణ నుంచి సినీప్రియులకు ఓ చక్కటి కానుక అందింది. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రంలో ఆయన భీష్ముని పాత్రలో నటించిన స్టిల్స్ను మంగళవారం సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నాన్న.. ఆయన వయసుకి మించిన భీష్మ పాత్రలో నటించి ప్రేక్షకుల ఆదరాభిమానాలను అందుకున్నారు. అందుకే నాకూ ఆ పాత్రంటే చాలా ఇష్టం. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రంలో భీష్ముని సన్నివేశాలు తీశాం. అయితే నిడివి ఎక్కువ అవడం వల్ల చిత్రంలో వాటిని ఉంచడం కుదరలేదు. ఇవాళ భీష్మ ఏకాదశి సందర్భంగా ఆ పాత్రకి సంబంధించిన అపురూప ఫొటోలను ప్రేక్షకులు, అభిమానులతో పంచుకుంటున్నాను’’ అన్నారు. ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ‘సింహా’, ‘లెజెండ్’ వంటి హిట్ల తర్వాత ఈ ఇద్దరి కలయికలో వస్తున్న మూడో చిత్రమిది. మే 28న విడుదలవుతుంది.