మహేశ్ బాబు .. పరశురామ్ కాంబినేషన్లో ‘సర్కారువారి పాట’ సినిమా రూపొందుతోంది. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమా షూటింగు, కొన్ని రోజులుగా ‘స్పెయిన్’లో జరుగుతోంది. హైదరాబాద్ .. గోవా .. దుబాయ్ లలో ఈ సినిమాకి సంబంధించిన ముఖ్యమైన షెడ్యూల్స్ ను ఇంతకుముందే పూర్తిచేశారు.
ఇక ఇటీవల కొన్ని కీలకమైన సన్నివేశాల కోసం .. ఒకటి రెండు పాటల కోసం ఈ సినిమా టీమ్ ‘స్పెయిన్’ వెళ్లింది. అక్కడ కొన్ని రోజులుగా చిత్రీకరణ జరుగుతూ వచ్చింది. తాజాగా పాట చిత్రీకరణతో అక్కడ షెడ్యూల్ ముగిసింది. ఆ రోజున ఈ సినిమా సెట్స్ లో నమ్రత సందడి చేసింది. ఈ సినిమా పాట షూటింగు పూర్తయిన తరువాత ఆమె అక్కడ కీర్తి సురేశ్ తో కలిసి సరదాగా మాట్లాడినట్టు ఈ పిక్ చూస్తే అర్థమైపోతోంది. నమ్రత ఏదో విషయం మాట్లాడుతూ ఉంటే, కీర్తి సురేశ్ నవ్వుతూ వింటున్నట్టుగా ఈ ఫొటోలో కనిపిస్తోంది. వెన్నెల కిషోర్ తో పాటు మిగతా యూనిట్ సభ్యులు అక్కడ కనిపిస్తున్నారు. హైదరాబాద్ లో జరిగే షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగు పార్టు పూర్తవుతుందని అంటున్నారు. జనవరి 13వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.
#SarkaruVaariPaata BTS 👌🕺🕺@urstrulyMahesh #MaheshBabu
Do Follow For More 😐 pic.twitter.com/5WpzdMaeCr— Sarkaru Vaari Paata 🔔 (@UrsSureshR9) October 26, 2021