పేరుకు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడే అయినా.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు మెగా బ్రదర్ నాగబాబు. సుదీర్ఘమైన ప్రయాణంలో హీరోగా, నిర్మాతగా, సహాయ నటుడిగా ఎన్నో విధాలుగా మెప్పించిన ఆయన.. దాదాపు మూడు దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ ముందుకెళ్తున్నారు. రాజకీయాల్లోనూ కాలేసిన ఈ టాల్ స్టార్.. సమాజంలో జరిగే అన్ని విషయాలపై స్పందిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉండే నాగబాబు… టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్పై నాగబాబు షాకింగ్ కామెంట్ చేశారు.
చాలా ఏళ్ల పాటు జబర్ధస్త్ షోకు జడ్జ్గా వ్యవహరించిన మెగా బ్రదర్ నాగబాబు.. కొద్ది రోజుల క్రితం ఆ షోకు గుడ్బై చెప్పేశారు. అదే సమయంలో మరో ఛానెల్లో ‘అదిరింది’ అనే షోను ప్రారంభించారు. జబర్ధస్త్ షోకు దర్శకత్వం వహించిన నితిన్, భరత్ దీనిని రూపొందించారు. అదిరింది, బొమ్మ అదిరింది అంటూ రెండు సీజన్ల పాటు సాగిన ఈ షో ప్రస్తుతానికి ప్రసారం అవడం లేదు.
వరుస సినిమాలు.. షోలు.. ఇతర కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్గా ఉంటారు మెగా బ్రదర్ నాగబాబు. ఇందులో భాగంగానే తన కెరీర్కు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విశేషాలను కూడా ఫ్యాన్స్తో పంచుకుంటుంటారు. అలాగే, సమాజంలో జరిగే ఎన్నో అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ పోస్టులు పెడుతుంటారు.
తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫాలోవర్లతో లైవ్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నెటిజన్లు చాలా మంది ఎన్నో రకాల ప్రశ్నలు అడిగారు. వీటన్నింటికీ సామాన్యుడిలానే జవాబులు ఇస్తూ ఆకట్టుకున్నారు మెగా బ్రదర్. అలాగే, రాజకీయాలు, సినిమాలపై తనదైన రీతిలో రిప్లై ఇచ్చారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పమంటే ఊహించని కామెంట్ చేశారు.
ఈ చాట్లో ఓ నెటిజన్ ‘వీరరాఘవ గురించి చెప్పు నారప్ప రెడ్డి’ అని ప్రశ్నించగా.. ‘ఇప్పటి తరం నటుల్లో టార్చ్ బేరర్’ అంటూ అనూహ్యమైన కామెంట్ చేశారు నాగబాబు. వేరే ఫ్యామిలీకి చెందిన హీరోని పొగుడుతూ ఆయన చేసిన వ్యాఖ్యపై ప్రశంసలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా.. వీళ్లిద్దరూ కలిసి ‘అరవింద సమేత.. వీరరాఘవ’లో తండ్రి కొడుకులుగా నటించిన విషయం తెలిసిందే.