మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆచార్య షూటింగ్ పూర్తి చేసిన ఆయన త్వరలో గాడ్ ఫాదర్ షూటింగ్ చేయనున్నాడు. గాడ్ ఫాదర్ చిత్రం మలయాళ మూవీ ‘లూసిఫర్’కి రీమేక్. ఇటీవలే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. మోహన్ రాజా ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా తరువాత మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమా చేయవలసి ఉంది.
ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నక్రమంలో మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. నవంబర్ 11న మూవీ పూజా కార్యక్రమాలు జరగనున్నాయని, 15 నుండి షూటింగ్ ప్రారంభం కానుందని తెలియజేశారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా కీలకపాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్గా తమన్నా ఎంపికైనట్టు సమాచారం. మణిశర్మ తనయుడు స్వర సాగర్ మహతి సంగీతం అందిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.
మరోవైపు బాబీ దర్శకత్వంలోను చిరు ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమాకి ‘వాల్తేర్ వీరయ్య’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇది ఏ సినిమాకి రీమేక్ కాదు .. కథ ఇక్కడ పుట్టి పెరిగిందే.దీనిని అద్భుతంగా తెరకెక్కించబోతున్నాడు బాబీ.
The Auspicious Day is Set for the MEGA LAUNCH ✨
MEGA 🌟 @KChiruTweets – @MeherRamesh Film #BholaaShankar 🔱 Muhurtam Ceremony will be held on 11-11-21, 7:45AM 🎬
Mega Shoot Begins from 15-11-21🎥@KeerthyOfficial @AnilSunkara1 #MahatiSwaraSagar @AKentsOfficial @BholaaShankar pic.twitter.com/sBsTUKWdEH
— BholāShankar (@BholaaShankar) October 27, 2021