వరుస సినిమాలతో జోరు చూపిస్తున్నారు కథానాయకుడు చిరంజీవి. ప్రస్తుతం ఆయన నటించిన ‘ఆచార్య’ విడుదలకు సిద్ధమవుతుండగా.. ‘గాడ్ఫాదర్’ సెట్స్పై ముస్తాబవుతోంది. కాగా.. ఇప్పుడాయన కొత్తగా ‘భోళా శంకర్’ను పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. తమిళంలో విజయవంతమైన ‘వేదాళం’కు రీమేక్గా రూపొందుతోన్న చిత్రమిది. మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ స్వరాలందిస్తున్నారు. శుక్రవారం మహతి పుట్టినరోజు. ఈ సందర్భంగా గురువారం ఓ కొత్త పోస్టర్ విడుదల చేసి, ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. నవంబరు నుంచి చిత్రీకరణ ప్రారంభం కానున్నట్లు స్పష్టత ఇచ్చారు. ఇందులో సంగీతానికి ఎంతో ప్రాధాన్యముందని, పాటలు, నేపథ్య సంగీతం హై స్టాండర్డ్స్లో ఉంటాయని చిత్ర బృందం తెలియజేసింది. ఈ సినిమాలో చిరంజీవికి చెల్లిగా కీర్తి సురేష్ కనిపించనుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో ప్రకటించనున్నట్లు దర్శక నిర్మాతలు తెలియజేశారు.
Wishing the Talented & Amazingly Skilled Young Music Composer #MahatiSwaraSagar 🎹 a very Happy Birthday !!
&
Proudly Welcoming on board for our MEGA FILM 🤘– Team #BholaaShankar 🔱
Mega 🌟 @KChiruTweets@KeerthyOfficial @MeherRamesh @AnilSunkara1 @BholaaShankar pic.twitter.com/kI0peuWOqd
— AK Entertainments (@AKentsOfficial) October 15, 2021