మంచు లక్ష్మీపై గత కొన్ని రోజులుగా ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. కేటీఆర్ తనకు కరోనా సోకిందని వేసిన ట్వీట్ మీద మంచు లక్ష్మీ స్పందించిన తీరు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. క్వారంటైన్లో ఉంటోన్న కేటీఆర్కు మంచు లక్ష్మీ వెరైటీ సలహాను ఇచ్చారు. తన సినిమాలు చూడమని సలహా ఇవ్వడంతో నెటిజన్లు తమ సెటైర్లతో పరువుతీసేశారు. ఇక మంత్రిని పట్టుకుని బడ్డీ అంటూ పిలవడంపైనా కౌంటర్లు వేశారు.
తాజాగా మరోసారి మంచు లక్ష్మీ మీద నెటిజన్లు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మంచు లక్ష్మీ తాను మొదటి డోస్ వ్యాక్సిన్ వేసుకున్నాని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఎవరైతే పద్దెనిమిదేళ్లు నిండిన వారున్నారో వారంతా వ్యాక్సిన వేసుకోవాలని సూచించారు. ఇప్పుడు ఇదే మన అస్త్రం అని అన్నారు. యశోద హాస్పిటల్లో ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేసుకున్నానని చెప్పుకొచ్చారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు.. ఎంతో పరిశుభ్రంగా ఉంచారు. ఎంతో బాగా ట్రీట్ చేస్తున్నారని మంచు లక్ష్మీ చెప్పుకొచ్చారు.
అయితే తెలంగాణలో ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేయడం ఆపేశారని, కానీ మంచు లక్ష్మీకి ఎలా వేశారని, కేవలం రెండో డోస్ వేసుకునే వాళ్లకే వ్యాక్సిన్ ఇస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది కదా? మరి ఇదేలా సాధ్య మని మంచు లక్ష్మీ మీద ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ క్రమంలో తెలంగాణ సీఎం, కేటీఆర్లను ట్యాగ్ చేస్తూ మంచు లక్ష్మీ వ్యాక్సినే వేసుకున్న విషయాన్ని ప్రశ్నిస్తున్నారు
It's a great day to have a great day! 🥳 Got my first jab at Yashodha Hospital. Very impressed with the hygiene and prompt service.
A feeling of relief.. Who would have thought getting a shot would be our highlight of this year.😉#Vaccinated pic.twitter.com/Ku2LRSKexd— Lakshmi Manchu (@LakshmiManchu) May 8, 2021