దివి సత్చంద్ర కిరణ్ (43), ఫార్మా లెజెండ్ మురళి కృష్ణ ప్రసాద్ దివి కుమారుడు. కిరణ్ తండ్రి, దివి లాబొరేటరీస్ వ్యవస్థాపకుడు మరియు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ధనవంతుడు. 2021 నాటికి దివి కుటుంబ సంపద 49,200 కోట్లు లేదా 6.8 బిలియన్ డాలర్లు ఉన్నట్లు పలు సంస్థలు వెల్లడించాయి.
కిరణ్ కి, దివి ల్యాబ్స్లో 20.34% వాటా ఉంది. వారసత్వంగా వచ్చిన పేర్లు అతన్ని మల్టీ-బిలియనీర్ గా మరియు తెలుగు రాష్ట్రాల్లో అతి పిన్న వయస్కుడైన (Male) బిలియనీర్ గా నిలిపాయి. 43 ఏళ్ల కిరణ్ సంస్థలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
వాటా డివిడెండ్ కాకుండా సంస్థ నుండి సంవత్సరానికి 20 కోట్ల వరకు జీతం తీసుకుంటారు.
ఇతర వివరాలు
పూర్తి పేరు : దివి సత్చంద్ర కిరణ్
వయసు : 43
తండ్రి : మురళి కృష్ణ ప్రసాద్ దివి
భార్య : శకుంతల దివి
కిరణ్ తోబుట్టువులు : నీలిమా మోటపార్తి
విద్య : జెఎన్టియులో ఫార్మా పోస్ట్ గ్రాడ్యుయేట్
ప్రస్తుత స్థానం : చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, డైరెక్టర్