ఈ సినిమాలో చరణ్ సరసన నాయికగా కియారా అద్వానిని ఎంపిక చేసినట్టుగా వార్తలు వచ్చాయి. అది నిజమేనని విషయం స్పష్టమైంది. ఈ రోజున కియారా అద్వాని పుట్టినరోజు కావడంతో, ఈ సినిమా టీమ్ ఆమెకు శుభాకాంక్షలు తెలిపింది. శంకర్ తో ఆమె ముచ్చటిస్తున్న ఫొటోను పోస్ట్ చేస్తూ, ఈ సినిమా ప్రయాణంలో ఆమె భాగమైనట్టుగా చెప్పారు.
ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పనుల్లోనే శంకర్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆయన తన వైపు నుంచి పనులను చక్కబెడుతూ వస్తున్నాడు. సెప్టెంబర్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. అది నిజమేననేది తాజా సమాచారం. ఆగస్టు మొదటివారంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిపేలా చూస్తున్నారట.
ఒకవేళ ఆగస్టు మొదటివారంలో కుదరకపోతే, ఆగస్టు 15వ తేదీన పూజా కార్యక్రమాలు జరగడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. సంగీత దర్శకుడిగా తమన్ రంగంలోకి దిగిపోయాడు. తెలుగుతో పాటు వివిధ భాషల్లో ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
Joining us on this super exciting journey is the talented and gorgeous @advani_kiara !
Welcome on board ❤️#HappyBirthdayKiaraAdvani#RC15 #SVC50@ShankarShanmugh @AlwaysRamCharan @MusicThaman @SVC_official pic.twitter.com/u4RU0Fs2ee
— Sri Venkateswara Creations (@SVC_official) July 31, 2021