విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం లైగర్ . ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఇస్మార్ట్ శంకర్ లాంటీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఈ సినిమా రావడంతో లైగర్పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో ఈ సారి పాన్ ఇండియా లెవల్లో వస్తున్నాడు. ఈ సినిమాను ఛార్మి, కరణ్ జోహార్లు కలిసి నిర్మిస్తున్నారు. లైగర్ తెలుగు హిందీ భాషాల్లో మాత్రమే కాకుండా ఇండియాలోని ప్రధాన భాషాల్లో ఈ సినిమా విడుదలకానుంది. విజయ్కు జోడిగా హిందీ భామ, స్టార్ కిడ్ అనన్య పాండే నటిస్తోంది. ఇందులో విజయ్ ఒక ఫైటర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని పూరి భారీ స్థాయిలో దాదాపు 125 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లైగర్ అటు పూరీ, ఇటు విజయ్ కెరీర్లో కూడా అత్యంత ఎక్కువ బడ్జెట్ సినిమాగా వస్తోంది. ఇప్పటికే 80 శాతం వరకు షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ముంబైలో షూటింగ్ను జరుపుకుంటోంది. ఈ సినిమాలో కీలక పాత్రలో రమ్యకృష్ణ కనిపించనుంది. అయితే తాజాగా మరోవార్త హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రంలో ప్రముఖ డ్యాన్సర్, నటుడు ప్రభుదేవా నటించనున్నాడని తెలుస్తోంది. అంతేకాదు ప్రభుదేవా లైగర్ బృందంతో కలిసి దిగిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ సినిమాలో ప్రభుదేవా నటిస్తున్నాడా లేదా సాంగ్కు కొరియోగ్రఫీ చేయనున్నాడా అనేది తెలియదు. దీనిపై కొంత క్లారిటీ రావాల్సి ఉంది.
ఇక లైగర్ సినిమా విషయానికి వస్తే.. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తోనట్లు తెలుస్తోంది. ఓ డాన్ పాత్రలో సునీల్ శెట్టి కనిపిస్తారట. అయితే సునీల్ శెట్టి కేవలం పదిహేను నిముషాల ప్లాష్ బ్యాక్ స్టోరీలో మాత్రమే కనిపిస్తాడని టాక్. మెలోడి కింగ్ మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించనున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 9న దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.
With PRABHUDEVA essentials 😜@puriconnects #addaa #PC @PDdancing #purijagannadh @JonnyShaik pic.twitter.com/BcbpXx1Nl0
— Charmme Kaur (@Charmmeofficial) March 28, 2021