వివాదాలకు కేరాఫ్ అడ్రస్ కంగనా రనౌత్. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎవరి ఒకర్ని టార్గెట్ చేయకుండా ఈ బ్యూటీ నిద్రపోదు. సోషల్ మీడియా అకౌంట్ లు బ్యాన్ చేసిన కంగనా తన రూట్ మాత్రం మార్చడం లేదు. ఇజ్రాయెల్ , పాలస్తీనా మధ్య యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు గురి చేస్తోంది. పాలస్తీనాలో హింస కొనసాగుతోంది. ఈ సమస్యపై ప్రపంచవ్యాప్తంగా ప్రజలు పాలస్తీనాకు మద్దతుగా ఇస్తున్నారు. భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా పాలస్తీనాకు మద్దతుగా ట్వీట్ చేశారు. అయితే, పాలస్తీన్కు ఇర్ఫాన్ మద్దతు ఇవ్వడంపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మండిపడ్డారు. కంగనా చేసిన రీ ట్వీట్కు సమాధానం ఇచ్చాడు ఇర్ఫాన్. పాలస్తీనాపై జరిగిన యుద్ధంలో చాలా మంది చిన్న పిల్లలు, సామాన్య ప్రజలు చనిపోతున్నట్లు నివేదికలు ఉన్నాయంటూ వివరణ ఇచ్చుకున్నాడు. అయితే ముందుగా మంగళవారం ఇజ్రాయెల్ హమాస్ రాజకీయ వింక్ అధికారిపై దాడి చేసి, 13 అంతస్తుల భవనాన్ని కూల్చివేసింది. ఇరు దేశాల మధ్య ఈ యుద్ధం 20 మే 921 ఆదివారం ప్రారంభమైంది. రెండు వైపుల నుండి రాకెట్ దాడులు కొనసాగుతున్నాయి. 1966 సంవత్సరం తరువాత మొదటిసారి లాడ్ నగరంలో పూర్తి అత్యవసర పరిస్థితి విధించడం.
If you have even slightest of humanity you will not support what’s happening in #Palestine #SaveHumanity
— Irfan Pathan (@IrfanPathan) May 10, 2021
ఇర్ఫాన్ మంగళవారం ట్వీట్ చేయడం ద్వారా పాలస్తీనాకు మద్దతు ఇచ్చాడు. “మీకు కొంచెం మానవత్వం కూడా ఉంటే, పాలస్తీనాలో ఏమి జరుగుతుందో తెలుస్తుంది. మీరు మద్దతు ఇవ్వండి” అంటూ మరోసారి ట్వీట్ చేశారు.
All My tweets are either 4 humanity or countrymen, from a point of view of a guy who has represented India at d highest level. On d contrary counters I get from ppl like Kangna who’s account get dismissed by spreading hate n some other paid accounts are only about hate. #planned
— Irfan Pathan (@IrfanPathan) May 13, 2021