బాలీవుడ్ స్టార్లు సల్మాన్ ఖాన్, కత్రినాకైఫ్ మార్చిలో టైగర్ 3 షూటింగ్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు స్టార్లు కొన్నాళ్ల క్రితం ముంబైలోని యశ్ రాజ్ స్టూడియోస్ దగ్గర కెమెరాలకు చిక్కారు. ఇమ్రాన్ హష్మీ కూడా టైగర్ 3 షూట్ లో జాయిన్ అయ్యాడు. ఈ చిత్రంలో నెగెటివ్ రోల్ చేస్తున్నాడు ఇమ్రాన్. తాజా సమాచారం ప్రకారం టైగర్ 3లో ఇమ్రాన్ హష్మీ ఐఎస్ఐ ఏజెంట్ గా కనిపించనున్నాడు.
రా ఏజెంట్ అవినాష్ సింగ్ రాథోడ్ గా సల్మాన్ కనిపించబోతుండగా..కత్రినాకైఫ్ ఐఎస్ఐ ఏజెంట్ జోయా రోల్ చేస్తోంది. టైగర్ 3 ప్రధానంగా భారత్, పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీల మధ్య జరిగే వార్ నేపథ్యంలో సాగనుంది. ఈ మూవీ రూ.350 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతుందని బీటౌన్ వర్గాల టాక్. సల్మాన్ఖాన్, కత్రినా కాంబోలో వస్తున్న మూడో చిత్రం. టైగర్ ప్రాంఛైజీలో వస్తున్న ఈ చిత్రాన్ని బ్యాండ్ బాజా బారాత్ డైరెక్ట్ మనీష్ శర్మ డైరెక్ట్ చేస్తున్నాడు.