కానీ, ప్రాజెక్టులను రీడిజైన్ చేసి కాంట్రాక్టర్లకు కట్టబెడితే కేసీఆర్ కు కమిషన్లు వస్తాయని చెప్పారు. మేఘ కంపెనీ కట్టే ప్రాజెక్టులకు డబ్బులు ఇస్తే కేసీఆర్ కు కమిషన్లు వస్తాయని అన్నారు. కమిషన్లకు కక్కుర్తి పడి అక్కరకు రాని పనులు చేస్తే గిట్లనే ఉంటది కేసీఆర్ దొర అని విమర్శించారు. మరోవైపు ప్రతి మంగళవారం షర్మిల నిరుద్యోగ దీక్షలను చేపడుతున్న సంగతి తెలిసిందే. నిరుద్యోగులకు ఉద్యోగాలను ఇవ్వకుండా కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆమె మండిపడుతున్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కానీ ప్రాజెక్టులు రీ డిజైన్ చేసి కాంట్రాక్టర్లకు కట్టబెడితే KCR కు కమిషన్లు వస్తయి,
మేఘకంపెనీ కట్టే ప్రాజెక్టులకు డబ్బులు ఇస్తే KCRకు కమిషన్లు వస్తాయి,
కమీషన్లకు కక్కుర్తి పడి అక్కరకు రాని పనులు చేస్తే గిట్లనే ఉంటది KCR దొర. 2/2— YS Sharmila (@realyssharmila) July 30, 2021