బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరైన హీరో సిద్ధార్థ్. ఈ సినిమా తర్వాత సిద్ధు నువ్వొస్తానంటే నేనొద్దంటానా? అనే సినిమా చేయగా ఇది కూడా మంచి విజయం సాధించింది.అయితే కొన్నాళ్లుగా తెలుగులో సరైన ఆఫర్స్ లేక తమిళ సినిమాలతోనే బిజీగా ఉన్నాడు. తాజాగా ఆయన చేసిన సినిమా ‘మహాసముద్రం దసరాకి రిలీజ్ కానుంది. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆయన శర్వానంద్ తో కలిసి నటించాడు.
రీసెంట్గా మహా సముద్రం ట్రైలర్ రిలీజ్ చేయగా, ఈ ఈవెంట్ కి అజయ్ భూపతి,శర్వానంద్, అనూ ఇమ్మాన్యుయేల్ తో పాటు సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. ఈవెంట్ లో సిద్ధార్థ్ కనిపించకపోవడంతో అభిమానులు ఆరాలు తీసారు. ప్రస్తుతం ఆయన లండన్లో ఉన్నారని, చిన్న ఆపరేషన్ చేయించుకుంటున్నాడని తెలుస్తుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే సిద్ధార్థ్ తన సర్జరీకి సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియాలో ప్రస్తావించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే విషయం తెలిసాక ఆయన అభిమానులు త్వరలో కోలుకోవాలని ప్రార్ధిస్తున్నారు.