యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్-జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం రాధే శ్యామ్. పీరియాడికల్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సంక్రాంతికి విడుదల కానున్న ఈ మూవీలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. భారీ పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్లుక్, మోషన్ పోస్టర్, టీజర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
లాక్డౌన్ వలన పలుమార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం సంక్రాంతికి పక్కాగా విడుదల అవుతుందని అంటున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కడప జిల్లాలోని గండికోటలో తెరకెక్కుతుంది. ఇందులో వేద పాఠశాలకు చెందిన గురువుగా సత్యరాజ్ కనిపించనున్నారు.ఆయనతో పాటు కొందరు అఘోరాలకి సంబంధించిన వారిపై చిత్రీకరణ చేస్తున్నారు మేకర్స్. గండికోటలో రాధేశ్యామ్ షూటింగ్ జరుగుతుందన్న సమాచారంతో ప్రభాస్ ఫ్యాన్స్ అక్కడికి భారీగా చేరుకుంటున్నారు.
రాధేశ్యామ్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ మూవీ యూరప్ బ్యాక్డ్రాప్తో సాగే ప్రేమకథ అని తెలుస్తోంది. 1979 బ్యాక్ డ్రాప్ లోకి తీసుకెళ్లి ప్రేక్షకులకి మంచి వినోదం పంచనున్నారట మేకర్స్. ప్రభాస్.. సలార్, ఆదిపురుష్ సినిమాలతో బిజీగా ఉంటూనే రాధేశ్యామ్ సినిమాను కూడా ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. ముంబైలో ఒకవైపు ఆదిపురుష్ షూటింగ్ చేస్తూనే పలు ప్రాంతాలలో సలార్ షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు
Cameron mass loading 💥💥🥁#Radheshyam #Prabhas pic.twitter.com/c4wkbtUZEh
— RadheShyam 💞 (@The_Tribbiani) August 20, 2021