ఇదిలా ఈ ఏడాది క్రాక్తో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు శ్రుతీ హాసన్. రవితేజ నటించిన క్రాక్ చిత్రం సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో విడుదల కాగా.. బ్లాక్బస్టర్గా నిలిచింది. ఆ తరువాత నెట్ఫ్లిక్స్లో విడుదలైన పిట్ట కథలు చిత్రంలోనూ ఎక్స్ లైఫ్లోనూ నటించారు శ్రుతీ. ఆమె నటించిన చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. ఇందులో ఆమె నటనకు పలువురు ప్రశంసలు కురిపించారు.
Happiest birthday to this incredible human @suprsanta pic.twitter.com/xFhH5YfL1J
— shruti haasan (@shrutihaasan) March 30, 2021
ప్రస్తుతం ఆమె రెబల్స్టార్ ప్రభాస్ సరసన సలార్లో నటిస్తుంది. కేజీఎఫ్తో దేశ వ్యాప్తంగా క్రేజ్ని సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక పవన్ కల్యాణ్ సరసన ఆమె నటించిన వకీల్ సాబ్, విజయ్ సేతుపతి సరసన నటించిన లాభమ్ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉంది. వీటితో పాటు మరికొన్ని కథలు ఆమె వింటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మ్యూజిక్లో మంచి ప్రావీణ్యం ఉన్న శ్రుతీ హాసన్.. ఓ ఆల్బమ్ను కూడా చేయబోతున్నట్లు టాక్.