తమిళనాడులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బిజీ బిజీగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. రోడ్ షోలకు పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ.. ప్రజల కష్టనష్టాలను తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో సోమవారం ములంగుమూడులో పర్యటించిన ఆయన సెయింగ్ జోసెఫ్ స్కూల్ విద్యార్థులో ముచ్చటించారు. ఈ సందర్భంగా పలువురు పదో తరగతి విద్యార్థులు రాహుల్ గాంధీకి ఫిట్నెస్ ఛాలెంజ్ విసిరారు. మెరిన్ షెలిఘో అనే విద్యార్థిని రాహుల్తో పుష్ అప్స్ పోటీకి దిగింది. ఇద్దరు పోటా పోటీగా పుష్ అప్స్ తీశారు. 50 ఏళ్ల వయసులోనూ రాహుల్ గాంధీ ఫిట్గా కనిపించారు. 15 ఏళ్ల పిల్లలకు ధీటుగా పుష్అప్స్ తీశారు.
Push up challenge by Merolin Shenigha, 10th standard Judo enthusiast to Shri @RahulGandhi ji.
Watch what happened next. pic.twitter.com/HjSERUud4k— Hitendra Pithadiya 🇮🇳 (@HitenPithadiya) March 1, 2021
అనంతరం అదే స్కూల్లో పలువురు విద్యార్థులతో కలిసి డాన్స్ చేసి సందడి చేశారు రాహుల్ గాంధీ. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
#WATCH: Congress leader Rahul Gandhi dances with students of St. Joseph's Matriculation Hr. Sec. School in Mulagumoodubn, Tamil Nadu during an interaction with them pic.twitter.com/RaSDpuXTqQ
— ANI (@ANI) March 1, 2021
ఇటీవల కేరళలో పర్యటించిన రాహుల్ గాంధీ కొల్లాంలో స్థానిక మత్స్యకారులతో కలిసి అరేబియా సముద్రంలో ఈతకొట్టారు. పడవ నుంచి సముద్రంలోకి దూకి సందడి చేశారు. మత్స్యకారులతో పాటు చేపలు పట్టారు. ప్రస్తుతం తమిళనాడులోనూ క్షేత్ర స్థాయిలో ప్రజల మధ్య తిరుగుతున్నారు రాహుల్ గాంధీ. రోడ్డు పక్కన ఆగి టీ తాగడం, ఆలయాలకు వెళ్లడం.. వంటి కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉన్నారు. కాగా, తమిళనాడులో ఏప్రిల్ 6న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. మే2న ఫలితాలను ప్రకటిస్తారు.