బాలీవుడ్ లో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ గా పేరొందిన…నితిన్ దేశాయ్కి చెందిన ఎన్డీ ఫిల్మ్ స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ స్టూడియోలో 2008లో వచ్చిన హిట్ మూవీ ‘జోధా అక్బర్’ సినిమా సెట్ పూర్తిగా కాలిపోయింది. ఈ సినిమాలో హృతిక్ రోషన్, అందాల తార ఐశ్వర్యా రాయ్ నటించారు. మహారాష్ట్రలోని రాయ్గడ్ జిల్లా ఖలాపూర్ సమీపంలో ఎన్డీ ఫిల్మ్ స్టూడియో ఉంది.
ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా స్టూడియో మొత్తం మంటలు వ్యాపించాయి. స్టూడియోలో ఉన్న ఫ్లై వుడ్, పీఓపీ..ఇతర సామాగ్రీ అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది..మంటలను ఆర్పివేశారు. ప్రాణనష్టం జరగలేదని పోలీసులు వెల్లడించారు. కానీ..ప్రమాదం ఎలా జరిగిందనేది తెలియరాలేదు.
Raging fire in ND Studios of art director Nitin Desai at Chowk in Khalapur tehsil, #karjat . Blaze began from fiber godown near #JodhaAkbar_Set. Fire brigade fighting the blaze.@MiLOKMAT pic.twitter.com/jkuXBq49EI
— karan darda (@kdarda) May 7, 2021