కరోనా నేపథ్యంలో వీరి వివాహాన్ని నిరాడంబరంగా నిర్వహించాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. మహాబలిపురంలో ఈ వివాహం జరగనుంది. కేవలం దగ్గర బంధువులు, అతి కొద్ది మంది స్నేహితులు మాత్రమే వివాహానికి హాజరుకానున్నారు. ఈ ఏడాది మే నెలలో శంకర్ తల్లి కన్నుమూశారు. ఈ విషాదం తర్వాత శంకర్ ఇంట్లో జరుగుతున్న తొలి శుభకార్యం ఇదే.
ప్రస్తుతం కమల్ హాసన్ తో ‘ఇండియన్-2’ సినిమాను శంకర్ తెరకెక్కిస్తున్నారు. ఆ తర్వాత రామ్ చరణ్ తో ఒక పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. అంతేకాదు బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ తో ‘అపరిచితుడు’ సినిమాను రీమేక్ చేయబోతున్నారు.