ఈ సినిమా మోహన్ లాల్ కెరియర్లో ప్రత్యేకమైనదిగా నిలవడమే కాకుండా, వైవిధ్యభరితమైన చిత్రంగా ప్రశంసలను అందుకుంది. దాంతో ఈ సినిమా రీమేక్ లో చేయడానికి చిరంజీవి ఆసక్తిని చూపించారు. ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను తమిళ దర్శకుడు మోహన్ రాజాకు అప్పగించారు. తెలుగు నేటివిటీకి తగినట్టుగా కథలో స్వల్పమైన మార్పులు చేశారు.
వచ్చేనెల 12వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం వేయిస్తున్న భారీ సెట్ పూర్తికావొచ్చింది. మలయాళంలో మోహన్ లాల్ చెల్లెలి పాత్రలో మంజువారియర్ నటించింది. తెలుగులో ఆ పాత్ర కోసం సుహాసినిని తీసుకున్నట్టుగా తెలుస్తోంది.