ప్రముఖ సినీనటుడు చిరంజీవి రాజమహేంద్రవరంలో పర్యటించారు. అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా ఆయన పేరుతో ఉన్న హోమియోపతి వైద్య కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని చిరంజీవి ఆవిష్కరించారు. అల్లు అరవింద్ ఆర్థిక సహాకారంతో దీన్ని ఏర్పాటు చేశారు. అనంతరం కళాశాలలో రూ.2కోట్లతో నిర్మించిన నూతన భవనాన్ని చిరంజీవి ప్రారంభించారు.