హైదరాబాద్లోని సైదాబాద్ బాలిక హత్యాచార నిందితుడు రాజు రైల్వే ట్రాక్ పై ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. ప్రముఖ సినీనటుడు చిరంజీవి తాజాగా రాజు ఆత్మహత్యపై స్పందిస్తూ… రాజు తనను తాను శిక్షించుకోవడం బాధిత బాలిక కుటుంబ సభ్యులతో పాటు అందరికీ ఊరట కలిగిస్తోందని చెప్పారు. బాలికలపై దారుణ ఘటనలు మరోసారి జరగకూడదని, అందుకు ప్రజలు చొరవచూపాలని ఆయన కోరారు.