ఇటీవల టోక్యో ఒలింపిక్స్-202`లో కాంస్య పతకం గెలుచుకుని రికార్డ్ సృష్టిచింది బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు. ఆమె బ్యాక్ టూ బ్యాక్ ఒలింపిక్స్ లో కాంస్య సాధించిన ఇండియన్ మహిళగా సంచలనం సృష్టించింది. దేశం గర్వించేలా చేసింది. ఈ నేపథ్యంలో పీవీ సింధుకి అనేక మంది టాలీవుడ్ సినీ ప్రముఖులు దేశం గర్వించేలా చేసింది. ఈ నేపథ్యంలో పీవీ సింధుకి అనేక మంది టాలీవుడ్ సినీ ప్రముఖులు
ఈ నేపథ్యంలో చిరంజీవి తాజాగా పీవీ సింధుని సత్కరించారు. హైదరాబాద్లో ఆమెకి ఘనంగా సత్కరించినట్టు తెలుస్తుంది. ఈ మేరకు ఓ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇందులో సీనియర్ నటి రాధిక, పీవీ సింధు,చిరంజీవి కలిసి ఫోటో దిగారు. రాధిక.సింధు గెలుచుకున్న మెడల్ని పట్టుకుని నవ్వుతూ పోజులివ్వడం ఆకట్టుకుంటుంది. ఈ పిక్ని రాధికా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.
ఆమె చెబుతూ, `పీవీ సింధును కలవడం చాలా సంతోషంగా ఉంది. మిత్రుడు చిరంజీవి.. సింధును సత్కరించే వేడుకలో నేను పాల్గొనడం గొప్ప అనుభూతి పంచింది`అని పేర్కొన్నారు. అయితే అది ఎక్కడ? అనే వివరాలు తెలియజేయలేదు.ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట సందడి చేస్తోంది.ఇదిలా రేపు చిరంజీవి తన 66వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు.
Proud to meet @Pvsindhu1 felicitated by good humanitarian and friend @KChiruTweets , what a feeling holding the gold which she has battled and won well for our country #pvsindhu #Olympics2020 #OlympicGold pic.twitter.com/cPRoUyeBep
— Radikaa Sarathkumar (@realradikaa) August 20, 2021