మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి కావస్తున్న నేపథ్యంలో తన 153వ చిత్రం లూసిఫర్ రీమేక్ షూటింగ్ స్టార్ట్ చేశారు చిరంజీవి. ఈ సినిమాకు కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమా షూటింగ్ ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో ప్రారంభమైంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ తో షూటింగ్ స్టార్ట్ చేశాడు దర్శకుడు మోహన్ రాజా.
ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో చిత్ర బృందంతో కలిసి దిగిన ఫోటో పోస్ట్ చేశారు. ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా…రామ్చరణ్ ఎన్ వి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీని తర్వాత చిరంజీవి వేదాళం రీమేక్ చేయబోతున్నాడు. ఆ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహించబోతున్నాడు.
With the blessings of parents and well wishers starting next journey, this time a Mega one 😇
Getting set with an amazing team
Dop #Niravshah
Art dir @sureshsrajan
Stunt @silvastunt #Chiru153 #megastar153#shootstarts pic.twitter.com/puSMuJP4Ju— Mohan Raja (@jayam_mohanraja) August 13, 2021