టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కుటుంబ సమేతంగా రేపు (శనివారం) తిరుమలకు చేరుకోనున్నారు. 21వ తేదీ ఆదివారం మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శనివారమే చంద్రబాబు కుటుంబం తిరుమలకు చేరుకుని రాత్రి అక్కడే బస చేయనున్నారు.ఆదివారం తెల్లవారుజామున శ్రీవారిని దర్శించుకోనున్నారు.నంతరం ప్రతిఏడాది లాగే ఈసారి కూడా అన్నదానం ట్రస్టుకు రూ.30లక్షలు విరాళంగా ఇవ్వనున్నారు.
నారా లోకేష్-బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్ ప్రతి పుట్టినరోజున కుటుంబం మొత్తం శ్రీవారిని దర్శనం చేసుకుంటారు.ఈ క్రమంలోనే ప్రత్యేక పూజలు నిర్వహించడమే కాదు టిడిపి నిత్యాన్నదాన ట్రస్టుకు భారీగా విరాళాన్ని అందిస్తారు.ఇలా ఈ ఏడాది కూడా శ్రీవారిని దర్శించుకోనుంది చంద్రబాబు కుటుంబం.