బుల్లితెరపై యాంకర్గా సత్తా చాటుతూనే వెండితెరపై వరుస ప్రాజెక్టులతో బిజీ అవుతోంది అనసూయ. తాజాగా ఆమెకు మలయాళీ ఇండస్ట్రీ నుంచి స్టార్ హీరో సరసన నటించే లక్కీ ఛాన్స్ దక్కిందని టాక్.
జబర్దస్త్ తెరపై జబర్దస్తీ చేస్తూ రోజురోజుకూ తన పాపులారిటీని అమాంతం పెంచేసుకుంటున్న యాంకర్ అనసూయ.. వెండితెరపై కూడా వరుస అవకాశాలు పట్టేస్తోంది. ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మతగా టాలెంట్ మొత్తం బయటపెట్టేసి దర్శకనిర్మాతల చూపు తనపై పడేలా చేసుకుంది అనసూయ. దీంతో తమ సినిమాల్లో అనసూయ కనిపితే కాస్త ప్లస్ అవుతుందని దర్శకులు ఆలోచించే రేంజ్ లోకి వెళ్ళింది ఈ జబర్దస్త్ బ్యూటీ. ఈ క్రమంలోనే తాజాగా ఆమెకు మలయాళీ ఇండస్ట్రీ నుంచి ఓ బంపర్ ఆఫర్ వచ్చిందట.
మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి హీరోగా నటిస్తున్న ‘భీష్మ పర్వం’ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర కోసం అనసూయను సెలక్ట్ చేశారని సమాచారం. ఈ రోల్ నచ్చడంతో అనసూయ కూడా ఏ మాత్రం సందేహించకుండా వెంటనే ఓకే చేసినట్లు సమాచారం. గతంలో మమ్ముట్టి తెలుగులో నటించిన `యాత్ర` చిత్రంలో అనసూయ కీలక పాత్ర పోషించింది. మళ్ళీ ఇప్పుడు ఆయనతోనే, అది కూడా మలయాళీ తెరపై కనిపించే ఛాన్స్ వచ్చిందంటే సౌత్లో అమ్మడి రేంజ్ ఎక్కడిదాకా వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు.