సోషల్ మీడియా ప్రాభావం ఎక్కువయ్యాక ఎంతో మంది సెలబ్రెటీల అవతరమెత్తారు..టిక్ టాక్ ఇన్స్టాగ్రామ్ ఇలా ఒక్కో ప్లాట్ ఫామ్ ను నమ్ముకుని సెలబ్రెటీలు అయ్యారు. అలా సెలబ్రెటీలుగా మారిన వారిలో బిగ్ బాస్ ఫేమ్ అష్షు రెడ్డి కూడా ఒకరు. అష్షు రెడ్డి ఇన్స్టాగ్రామ్ లో తన పోస్ట్ ల తో సెలబ్రెటీ అయ్యింది. కేవలం పోస్ట్ లు పెడితేనే సెలబ్రెటీలు అవ్వలేరు గాని అష్షు అచ్చం సమంత లా ఉండటంతో ఈ అమ్మడు తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులారిటీని సంపాదించుకుంది. సోషల్ మీడియాలో వచ్చిన సెలబ్రెటీ స్టేటస్ తోనే బిగ్ బాస్ హౌస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇక హౌస్ నుండి బయటకు వచ్చాక టీవీ షోలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది.
అంతే కాకుండా ఇప్పుడు సినిమాల్లోనూ నటిస్తోంది. ఈనేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ సినిమాలోనూ నటించే ఛాన్స్ కొట్టేసింది. అయితే తాజాగా పవన్ తో కలిసిన ఫోటోను షేర్ చేసిన అష్షు..తనకు పవన్ స్వీట్ లెటర్ ఇచ్చారని..తనతో 2గంటలు మాట్లాడారని..టాటూ గురించి చర్చించారని మురిసిపోయింది..అయితే ఆ లెటర్ పవన్ తన కో స్టార్స్ అందరికీ రాసినట్టే..కెరీర్ లో ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నా అని రాసారు. ఇక అష్షు పోస్ట్ కు ఓ నెటిజన్ “మీకు పవన్ కళ్యాణ్ నాలుగో భార్యగా అవకాశం వస్తే ఒప్పుకుంటారా అని కామెంట్ పెట్టగా..అష్షు ఎస్ చెబుతా అంటూ ఆన్సర్ ఇచ్చింది. దాంతో అదేషు కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.