నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న అఖండ సినిమా గత రెండేళ్లుగా అభిమానులను ఊరిస్తుంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన సింహా మరియు లెజెండ్ సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. దాంతో ఈ సినిమ కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలు పీక్స్ కు తీసుకు వెళ్లింది. ఈ సినిమా టైటిల్ నందమూరి అభిమానులకు అబ్బ అనిపించే విధంగా ఉందంటున్నారు. షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. కరోనా సెకండ్ వేవ్ అవ్వడం వల్ల వచ్చే నెలలో విడుదల కావాల్సిన సినిమాను వాయిదా వేస్తారని వార్తలు వస్తున్నాయి.
థియేటర్లు మళ్లీ ఎప్పటికి పూర్తి స్థాయిలో నడుస్తాయి అనేది చెప్పలేని పరిస్థితి. అలాంటి సమయంలో అఖండకు భారీ ఆఫర్ ను ఒక ఓటీటీ సంస్థ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. నేరుగా తమ ఓటీటీలో సినిమాను విడుదల చేస్తే ఏకంగా 65 కోట్ల రూపాయలను ఇస్తామంటూ ముందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ ఢీల్ పట్ల అఖండ దర్శక నిర్మాతలు ఓకే చెప్పే అవకాశం ఉందంటున్నారు. మొత్తానికి అఖండ సినిమా మరో లెవల్ లో ఉంటుందని అంటున్నారు. కనుక రూ.65 కోట్ల ఢీల్ ఆఫర్ వచ్చింది. బాలయ్య సినిమాలు పాతిక కోట్లు కూడా ఈమద్య బిజినెస్ చేయలేక పోతున్నాయి. 10 నుండి 15 కోట్లు మాత్రమే వసూళ్లు రాబడుతున్నాయి. అలాంటిది ఈ సినిమాకు రూ.65 కోట్లు అంటే కళ్లు మూసుకుని సినిమాను ఇచ్చేయవచ్చు అంటున్నారు. నందమూరి అభిమానులు కూడా అఖండ ఓటీటీ రిలీజ్ కు మొగ్గు చూపుతున్నారట.