ఆన్లైన్ టికెట్ విధానంపై విజయవాడలో సోమవారం మంత్రి పేర్నినాని సమీక్ష సమావేశం నిర్వహించనున్నాను. ఈ సమావేశంలో సినీ నిర్మాతలు,డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, థియేటర్ యజమానులతో మంత్రి భేటికానున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఆన్లైన్ టికెట్ వ్యవస్థ, కరోనా వలన సిని పరిశ్రమ ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి చర్చించనున్నారు. ఆన్లైన్ టికెట్లపై స్టేక్ హోల్డర్లతో చర్చించి ఆ తర్వాత పూర్తి స్థాయిలో నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.